ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ంలో దాదాపు అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతునే ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడులా చేస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులు రాజధాని తరలింపుపై ఉద్యమం చేస్తుంటంతో జిఎస్రావు నివేదికపై సర్కారు ఏం నిర్ణయం తీసుకోబోతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
తాజాగా గ్రేటర్ రాయలసీమ డిమాండ్ మళ్లీ తెరమీదకి రావడంతో పాటు ఈ ప్రాంత నేతలంతా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చెపడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ఒరిగేదేమీ లేదని.. అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయాలని గ్రేటర్ రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఈ మేరకు గ్రేటర్ రాయలసీమ వేదిక తరఫున మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, హైకోర్టు న్యాయవాదులు సహా రాయలసీమ ప్రముఖులు బుధవారం సీఎం వైఎస్ జగన్కు లేఖ రాశారు.
అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనుకుంటున్న విశాఖపట్నం రాయలసీమకు వందల కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. తాజాగా కర్నూలును రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa