ఇప్పటికే ఏపి రాజధాని ప్రాంత శాసనసభ్యులు కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తతున్న తరుణంలో గురువారం అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు.
ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 03.30 గంటలకు సమావేశమై 3 రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనలు, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు అన్ని రకాలుగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్టు సమాచారం. రాజధాని తరలింపుపై అమరావతి ప్రాంత రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వైసీపీ నేతలు చెపుతున్నారు.
డిసెంబరు 27న ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. రాజధాని జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో అమరావతి ప్రాంత ఎమ్మెల్యేలు, నేతలు సమావేశం కావడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. వారు ప్రభుత్వం చెప్పిన దానికి తలూపుతారా? లేక రాజధాని ప్రాంత రైతులకు సానుకూలంగా మాట్లాడతారా? అన్నది ప్రశ్నార్ధకమే. ఏం జరగనుందో సాయంత్రం నాటికి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa