అమరావతి రైతుల ఆందోళనలపై నోరు జారిన మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు అక్కడ ఉద్యమం చేస్తున్న వారంతా టీడీపీ కార్యకర్తలే 8 ఊళ్లలో ఉన్న వాళ్లు లింగు లింగుమంటూ వద్దంటే రాజధాని విశాఖలో పెట్టొద్దా?. అని ,విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును స్వాగతిస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఓ సభలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసారు.
ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోక వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమం చేయాలా..? అమరావతి రైతులు ఉద్యమం చేయాలా? అని ప్రశ్నించారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయని గుర్తుచేశారు. అమరావతి ఆందోళనలన్నీ బోగస్ అని,అవన్నీ టీడీపీ డైరెక్షన్లో జరుగుతోన్న నిరసనలే అని ఎద్దేవా చేశారు. పేపర్లలో పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకుంటూ ఏదో పెద్ద ఉద్యమం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ వైసిపి కార్యకర్త ధర్మాన వ్యాఖ్యలను సెల్లో చిత్రీకరించి పోస్టు చేయటంతో అమరావతి రైతుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్టయ్యింది.
ఇదే విషయాన్ని ధర్మానని నిలదీస్తూ, ఓ యువకుడు ఫోన్ చేసాడు. అమరావతి రైతుల ఆందోళనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మీమాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. దాంతో ధర్మాన ‘క్షమించేయండి, అమరావతి వచ్చినప్పుడు కలుద్దాం’ అని ముగించేందుకు ప్రయత్నించారు.
అయితే ఉత్తరాంధ్రలో మంత్రిగా పనిచేసిన ధర్మాన అక్కడ ఏం ఓరగబెట్టలేదనటానికి అక్కడ పడకేసిన అభివృద్దే తార్కాణమని, తక్షణం తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, అమరావతి వచ్చి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు రాజధాని రైతులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa