భారత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా రూ.2,701 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గతంలో భారీ నష్టాలను ఎదుర్కొన్న ఈ రంగం, ప్రభుత్వ సంస్కరణలు, ఎలక్ట్రిసిటీ (లేట్ పేమెంట్ సర్ఛార్జీ) నియమాల అమలుతో బకాయిలు 96% తగ్గి ఆర్థికంగా బలపడింది. రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, స్మార్ట్ మీటరింగ్ వంటి చర్యలు ఈ మార్పునకు దోహదపడ్డాయని పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa