ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 06:44 AM

ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్‌పీటీఈఎల్  కింద అందిస్తున్న ‘అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్’ కోర్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశేష స్పందన రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కోర్సులో ఇప్పటికే రాష్ట్రం నుంచి 50,000 మందికి పైగా విద్యార్థులు చేరడం సంతోషకరమని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ, క్వాంటం టెక్నాలజీలో అంతర్జాతీయ ప్రమాణాలతో లక్ష మంది నిపుణులను తయారు చేయాలన్న తమ లక్ష్యానికి ఈ స్పందన మరింత బలాన్నిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.భవిష్యత్తు క్వాంటం టెక్నాలజీదేనని పేర్కొన్న చంద్రబాబు, ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన వారిని తానే వ్యక్తిగతంగా సత్కరిస్తానని ప్రకటించారు. క్వాంటం రంగంలో భవిష్యత్ ప్రపంచ నాయకులుగా ఎదిగే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa