ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్పీటీఈఎల్ కింద అందిస్తున్న ‘అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్’ కోర్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశేష స్పందన రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ కోర్సులో ఇప్పటికే రాష్ట్రం నుంచి 50,000 మందికి పైగా విద్యార్థులు చేరడం సంతోషకరమని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ, క్వాంటం టెక్నాలజీలో అంతర్జాతీయ ప్రమాణాలతో లక్ష మంది నిపుణులను తయారు చేయాలన్న తమ లక్ష్యానికి ఈ స్పందన మరింత బలాన్నిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం రంగంలో పరిశోధన, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.భవిష్యత్తు క్వాంటం టెక్నాలజీదేనని పేర్కొన్న చంద్రబాబు, ఈ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన వారిని తానే వ్యక్తిగతంగా సత్కరిస్తానని ప్రకటించారు. క్వాంటం రంగంలో భవిష్యత్ ప్రపంచ నాయకులుగా ఎదిగే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa