ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి,టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆ కేసుల నుంచి తప్పించుకోలేరని ఆయన మళ్లీ జైలుకు వెళ్లి శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. యనమల ఏమన్నారంటే.. “సీఎం జగన్ మనీలాండరింగ్ కేసు నుంచి తప్పించుకోలేడు. 11 ఛార్జీషీట్లలో ట్రయల్ రన్ ప్రారంభమైతే సీఎం జగన్ ఫోకస్ అంతా బోనులేనే ఉంటుంది. జగన్ బోనులో ఉంటే ప్రజలు అసహ్యించుకుంటారు. అందుకే దాని నుంచి దృష్టి మరల్చేందుకే సీఎం జగన్ రాజధానుల నాటకం ఆడుతున్నాడు.
వికేంద్రీకరణ బిల్లు తొలుత ఆర్డినరీ రూపంలో వచ్చింది. ఆ తర్వాత మనీబిల్లుగా వచ్చింది. అసలు మంత్రులు బిల్లులను చదువుతున్నారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజాభిప్రాయం తీసుకొని చేయాల్సిన నిర్ణయాలను అధికారం ఉందని ఇష్టానుసారం చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. సీఎం జగన్ పతనం ఖాయం. అతను త్వరలోనే మళ్లీ జైలుకెళ్తాడు.” అని యనమల అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa