ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దుకు కేబినేట్ ఆమోదించింది. మరికాసేపట్లో దీని పై తీర్మాణం చేసి అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. దాని పై వెంటనే చర్చించి అసెంబ్లీ ఆమోదించనుంది. ఆ తర్వాత కేంద్రానికి తీర్మాణం కాపీని పంపనున్నారు. సీఎం జగన్ ప్రతిపక్షాలకు షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మండలిలో ఛైర్మన్తో కలిపి మొత్తం 58 మంది సభ్యులు ఉన్నారు. అందులో.. టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8 మంది ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో 1958లో ఆర్టికల్-168 కింద జూలై 1న శాసనమండలి తొలిసారిగా ఏర్పాటైంది. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, 1958 జులై 8న మండలిని అధికారికంగా ప్రారంభించారు. మండలి ఆవిర్భవించిన 27 సంవత్సరాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేశారు. అనవసరమైనది..జనాభాలో ప్రాతినిధ్యం లేనిదని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్పై భారం, చట్టాలు ఆమోదించడంలో జాప్యం కావడంతో రద్దు చేశారు.
ఇలా ఎన్నో కారణాలతో ఎన్టీఆర్ ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ తీర్మానించారు. మండలి కోసం 1990 జనవరి 22న అసెంబ్లీలో తీర్మానం చేశారు. 1990 మే 28న పార్లమెంటు ఎగువసభలో తీర్మానం పాస్ చేశారు. 1991లోక్సభ రద్దుతో మండలి పునరుద్దరణ తీర్మానం మరుగునపడింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 జులై 8న శాసన మండలి పునరుద్దరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. 2006 డిసెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందింది. 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 2007 మార్చి 30న ఏపీ శాసనమండలి మళ్లీ ఏర్పాటైంది. శాసనసభతో పాటు మండలి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa