ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నుంచి వైసీపీలోకి 17 మంది ఎమ్మెల్యేలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 12:44 PM

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి రావడానికి 17 మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాల పట్ల స్వంత పార్టీ ఎమ్మెల్యేలకే ఆయన పై విరక్తి కలిగిందన్నారు. శాసనమండలి రద్దు ఆలోచన చంద్రబాబు వ్యవహరించిన తీరువల్లే వచ్చిందన్నారు.


తమతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని తాము ఎవరిని ప్రలోభ పెట్టలేదన్నారు. సీఎం జగన్ న్యాయపరంగా ముందుకు పోవాలన్నారు కాబట్టే ఆగుతున్నామని లేకపోతే ఇప్పటికిప్పుడు టీడీపీ ఖాళీ అవుతుందని సజ్జల అన్నారు. 17 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు తమతో టచ్ లో ఉన్నారని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. ఆ 17 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa