టిడిపికి చెందిన మరో మాజీమంత్రి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీకి కొద్దో గొప్పో చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు రేపు వైసీపీలో చేరనున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. కుమారుడితో కలిసి ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం సీఎం జగన్కు జై కొట్టారు. మాజీమంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరనుండటం టీడీపీకి పెద్ద దెబ్బగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa