ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో త్వరలోనే 5 కిలోల సిలిండర్లు, కిరోసిన్ పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2026, 11:54 AM

 రాష్ట్రంలో గ్యాస్ సరఫరా కొరతను తీర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామాల్లో సిలిండర్ల డెలివరీ ఆలస్యంపై అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎల్‌పీజీ ఏజెన్సీలతో నిత్యం సమీక్షించాలని ఆదేశించారు. గ్యాస్ కొరతను తగ్గించేందుకు త్వరలో 5 కిలోల సిలిండర్ల పంపిణీకి కేంద్రం సిద్ధమవుతోందని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో కిరోసిన్ సరఫరా కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. సరఫరాలో అవకతవకలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa