United States – Iran మధ్య సుమారు 39 రోజుల పాటు కొనసాగిన ఘర్షణ ముగియడంతో, భారత ప్రభుత్వం ఎల్పీజీ సరఫరా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సమయంలో హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా గ్లోబల్ ఇంధన సరఫరా ప్రభావితమై, భారత్లో కూడా ఎల్పీజీ కొరత ఏర్పడింది.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్రం పారిశ్రామిక అవసరాల కోసం ఎల్పీజీ సరఫరాలో కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గృహేతర (నాన్-డొమెస్టిక్) ఎల్పీజీ కేటాయింపులో రాష్ట్రాలకు ఉన్న 70 శాతం కోటాకు అదనంగా మరో 10 శాతం కేటాయింపు ఇవ్వనుంది. అయితే ఈ అదనపు కేటాయింపు, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది.ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్, పాలిమర్స్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్స్, గ్లాస్, సిరామిక్స్ వంటి కీలక పరిశ్రమలకు బల్క్ ఎల్పీజీ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 మార్చి నాటికి ఈ పరిశ్రమలు తమ మొత్తం అవసరాల్లో కనీసం 70 శాతం ఎల్పీజీ వినియోగించేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. రోజుకు 0.2 TMT పరిమితితో సరఫరా చేయనున్నారు. సహజ వాయువుకు మారడం సాధ్యం కాని యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇందుకోసం ఆయా పరిశ్రమలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే, సాధ్యమైన చోట PNG కనెక్షన్కు దరఖాస్తు చేయడం తప్పనిసరి.కేంద్రం నేచ్యురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ సప్లై ఆర్డర్ అమలుపై రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అదనపు 10 శాతం కోటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని సూచించింది. యుద్ధానంతర ఇంధన ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం, పరిశ్రమలకు తక్షణ ఉపశమనం కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో గ్యాస్ వినియోగాన్ని సమతుల్యం చేసే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa