ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, పరిశ్రమలకు గ్యాస్ కేటాయింపులను ఖరారు చేసింది. మొత్తం ఎల్పీజీలో 70% రాష్ట్రాలకు కేటాయించగా, పీఎన్జీ ప్రోత్సాహం ఇచ్చే రాష్ట్రాలకు అదనంగా 10% ఇవ్వనుంది. పరిశ్రమలకు సరఫరాపై పరిమితులు విధించి, సగటు వినియోగంలో 70% మాత్రమే అందించనున్నారు. అవసరమైన రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారాలని కేంద్రం సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa