దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు ముందు చూపుతో ఆక్సిజన్ను సైతం సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో పశ్చిమ్ విహార్ ప్రాంతంలో జీ-17లోని స్థానిక సంక్షేమ సంఘం ఆక్సిజన్ సరఫరా చేసే మూడు పరికరాలను ఇటీవల కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ సొసైటీలో అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ను అందిస్తామని ఆ సంఘం అధ్యక్షుడు లోకేశ్ ముంజాల్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa