ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలితో ఉండగా చూశాడని

national |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 03:29 PM

తమిళనాడులో ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి ఉండగా చూశాడని ఓ చిన్నారిని హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుప్పూరు జిల్లా ఊత్తుకుల్లి సమీపంలోని సొట్టక వుండమ్ ప్రాంతానికి చెందిన తంగరాజ్,సుమతి దంపతులకు కవల పిల్లలు విఘ్నేష్,భువనేష్. తంగరాజ్,సుమతి బనియన్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తన కాలేజ్ ఫ్రెండ్ అయిన యువకునితో కలిసి ఉండడాన్ని భువనేష్ చూశాడు. ఈ విషయం బయటికి పొక్కుతుందని వారు భయపడ్డారు. భువనేష్ ని ఆ యువకుడు కత్తితో పొడిచి చంపి పొదల్లో పడేశారు. ఈ ఘటన శనివారం జరిగినట్టు సమాచారం. పనికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు కొడుకు కనపడకపోవడంతో అంతా వెతకగా చివరికి విగతజీవిగా అతను కనిపించాడు. ఈ ఘటన పై ఊత్తుకులి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa