ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో మిలిటరీ లాక్‌డౌన్... ఇది పక్కా ఫేక్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 06:01 PM

ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ మిలిటరీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వాట్సాప్‌లో ఓ సందేశం తెగ చక్కర్లు కొడుతోంది. 10 రోజుల పాటు ముంబై, పుణే నగరాల్లో మిలిటరీ లాక్‌డౌన్ విధిస్తారని ఆ వార్త సారాంశం. కఠిన లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని ఉద్ధవ్ థాక్రే ప్రకటించినా ఈ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ కావడం గమనార్హం..‘ముంబై, పుణే నగరాలు పూర్తిగా ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిపోతాయి. వీలైనంత త్వరగా నిత్యావసరాలు, కూరగాయలు తెచ్చిపెట్టుకోండి. పాలు, మందులు లాంటి అత్యవసరాలు మాత్రమే లభిస్తాయి. ముంబై, పుణే నగరాల్లో నివసించే వారంతా ఈ విషయాన్ని గమనించండి..’ అంటూ ఓ మెసేజ్‌ను సర్క్యులేట్ చేస్తున్నారు.వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా అవాస్తవం. ముంబై నగర పోలీసులు దీన్ని ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa