ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో కరోనా మృతి.. అధికారులకు సవాల్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 05:12 PM

దేశంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించిన కేరళలో ఓ కరోనా కేసు అక్కడి వైద్యాధికారులకు సవాల్ విసిరింది. వివరాల ప్రకారం.. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఎక్సైజ్ విభాగంలో సునీల్‌ కుమార్‌ మత్తన్నూర్ అనే 28 ఏళ్ల వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు గురువారం ఉదయం కరోనాతో చనిపోయాడు. అత్యంత ఆరోగ్యంగా ఉన్న సునీల్ చనిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే చనిపోయే ముందు వరకు అతడిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడమే కాక.. ఎక్కడ, ఎవరి ద్వారా అతడికి కరోనా సోకింది అనే విషయం ఇంకా తెలియలేదు.జూన్ 12న అతడు అనారోగ్య లక్షణాలతో మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఒకే సారి పరిస్థితి విషమంగా మారడంతో ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించగా జూన్ 16న పాజిటీవ్ అని తేలింది. ఒక రోజు తర్వాత 18న ఉదయం అతను చనిపోయాడు. అయితే బాధితుడికి కరోనా ఎలా సోకిందన్న విషయం తేల్చేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. డ్రైవర్ కావడంతో అతను ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎంతమందిని కలిశాడన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కేరళలో లక్షణాలు లేకుండా చనిపోయిన రెండో వ్యక్తి సునీల్ అని అక్కడి ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa