ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు,మెడికల్ ఇనిస్టిట్యూట్ లు 120 రకాల వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుపుతున్నాయి. ఇందులో 7 రకాల వ్యాక్సిన్లు డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. తమిళనాడులోని తాంబరంలో సిద్ద నేషనల్ ఇనిస్టిట్యూట్ డాక్టర్లు మూలికలతో కఫసుర అనే మందును తయారు చేశారు. మూలికల ద్వారా చూర్ణం మందును తయారు చేశారు. దానిని కరోనా వచ్చిన వారికి ఏప్రిల్ 1న ఐదు రోజుల పాటు అందించారు. 5 రోజుల తర్వాత వారికి పరీక్షలు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. మే, జూన్లో SRM ఆస్పత్రిలోని కరోనా బాధితులకు మరోసారి ఇదే మందును ఇచ్చి చూశారు. అక్కడ పాజిటివ్ ఉన్నవారంతా ఐదు రోజుల్లోనే నెగెటివ్ అయిపోయారు. అంటే ఈ మందు తీసుకుంటే కరోనా ఐదు రోజుల్లోనే ఖతమైపోతుందన్నమాట. ఐసీఎంఆర్ పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున ప్రయోగాలు జరిపిందుకు డాక్టర్లు సిద్దమవుతున్నారు. వ్యాక్సిన్ కంటే ముందే కరోనాకు కఫసుర మందు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa