ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిశాలో భారీ వర్షాలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 09:08 AM

బెంగాల్ తీరంలో ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా మూడురోజులుగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యేక సహాయ కమిషనర్ పీకే జెనా తెలిపారు. ప్రధాన నదులైన బైతారాణి, బ్రాహ్మణి, సుబర్‌నరేఖ, బుధబలంగలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 


అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోగా పంటపొలాలు తుడుచుపెట్టుకుపోయాయని విపత్తు నిర్వహణ మంత్రి సుడం మర్నడి తెలిపారు. భద్రాక్, బాలసోర్, జాజ్‌పూర్‌ జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మయూరభంజ్, బార్‌గర్‌ జిల్లా ఇద్దరు నదిలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు 7,000 మందికిపైగా వరద సహాయక శిబిరాలకు తరలించారు. బుధవారం నుంచి రాష్ట్రంలో సగటున 55.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఆరు జిల్లాల్లో సగటున 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని రాష్ట్ర మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa