లగడపాటి రాజగోపాల్ ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే ఒక సర్వే చేసి ఫలితాలను ముందే చెప్పేస్తుంటారు. గతంలో కూడా ప్రధాన ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశంపార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అంతేకాదు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపిల సీట్లపై కూడా స్పష్టమైన సంఖ్యను కూడా ఇచ్చారు. లగడపాటి సర్వేలో వచ్చినట్లుగానే అటుఇటు రెండుమూడు సీట్లు తప్ప టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవడం, ఆ తరువాత ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడకపోవడం జరిగిపోయాయి. కానీ తాజాగా తన స్నేహితులతో నంద్యాల ఉప ఎన్నికలపై లగడపాటి సర్వే చేశారట. ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని తేల్చేశారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల ద్వారా అందరికీ సమాచారం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సర్వే చేయించిన లగడపాటి ఈ నిర్ణయాన్ని ప్రకటించారట. లగడపాటి సర్వేతో టిడిపి ఆలోచనలో పడింది. ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే శిల్పామోహన్ రెడ్డి వైసిపిలోకి వెళ్ళిపోయి తన వారందరినీ లాక్కుని పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న తరుణంలో అధికారపార్టీకి పెద్ద తలనొప్పే వచ్చి పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa