ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాలూ అవకతవకలకు పాల్పడ్డారు: సీబీఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 07, 2017, 12:49 PM

న్యూఢిల్లీ: రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ తెలిపారు. లాలూ నివాసంతో పాటు దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో సీఐబీ శుక్రవారం ఉదయం సోదాలు చేసిన విషయం తెలిసిందే. హోటళ్ల లీజు విషయంలో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారరుడు తేజస్వీ యాదవ్‌పైనా సీబీఐ కేసు నమోదు చేసింది.  ఈ కేసుకు సంబంధించి  సీబీఐ డిప్యూటీ డైరెక్ట‌ర్ రాకేష్ ఆస్తానా మీడియా సమావేశంలో మాట్లాడారు. లాలూ ప్రవేట్‌ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని, హోటళ్ల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. సోదాలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా 2006లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేకు చెందిన రెండు హోటళ్లను ప్రైవేట్‌ హాస్పిటాలిటీ గ్రూప్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హోటళ్లను ఎక్స్చేంజ్‌ చేయడం కోసం ఈ హాస్పిటాలిటీ గ్రూప్‌ పాట్నాలోని రెండు ఎకరాల విలువైన భూమిని లాలూ సంస్థలకు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa