లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం జరగబోయే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్తో క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్ తలపడనున్నాడు. ఫెదరర్కి ఇది 11వ వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. శనివారం పురుషుల సింగిల్స్ సెమీస్లో ఫెదరర్ థామస్ బెర్డిచ్(చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి ఫైనల్కి దూసుకెళ్లాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్కి టెన్నిస్ అంటే చాలా ఇష్టం. రోజర్ ఫెదరర్ అంటే కూడా చాలా ఇష్టం. దీంతో శుక్రవారం ఫెదరర్ సెమీఫైనల్ మ్యాచ్ని సచిన్ తన భార్యతో కలిసి స్వయంగా వీక్షించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ‘నేను టెన్నిస్ ఆటకి వీరాభిమానిని. రోజర్ ఫెదరర్కి మద్దతు తెలిపేందుకు వచ్చాను. గత పదేళ్లుగా అతని ఆటని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాను’ అని సచిన్ తెలిపాడు.
టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. వీనస్ విలియమ్స్(అమెరికా)- ముగురుజ(స్పెయిన్) మధ్య ఫైనల్ పోరు జరగనుంది. మార్టినా నవ్రతిలోవా తర్వాత వింబుల్డన్ టోర్నీ ఫైనల్ చేరిన పెద్ద వయస్కురాలిగా వీనస్(37) నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa