విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా గాడిలో పెట్టామని, 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితుల నుంచి, సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని తెలిపారు. ఈ స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.గత ఏడాదిన్నర కాలంలో సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. "తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేశాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు 3.5 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, దీని కోసం రూ.1,114 కోట్లు ఖర్చు చేశాం. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు, దీపం 2.0 కింద 2 కోట్ల సిలిండర్ల పంపిణీకి రూ.2,684 కోట్లు వెచ్చించాం. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలో కొత్త మైలురాయిని అధిగమించాం" అని చంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa