ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బట్టలు ఉతకడానికి వెళ్లి నలుగురు మృతి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 04, 2021, 02:58 PM

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయతీ ఒంటూరులో విషాదం నెలకొంది. బట్టలు ఉతకడానికి ఏటికి పిల్లలతో కలిసి వెళ్లిన వారు నీట మునిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముందుగా ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడటానికి వెళ్లి ఇద్దరు మహిళలు నీటిలో మునిగిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికులు కలిపి గాలించగా నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఒకే గ్రామంలో నలుగురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అప్పటి వరకు తమ ముందు ఉన్న పిల్లలు విగతజీవులుగా మారడంతో ఒంటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని రుక్మిణి భాయ్ (36), ఆరతి (8), కీర్తి (6), రాజేశ్వరి (26)లుగా పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa