ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత 24 గంటల్లో 9,309 మందికి కరోనా పాజిటివ్ కేసులు..

national |  Suryaa Desk  | Published : Fri, Feb 12, 2021, 11:40 AM

 దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 9,309 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 15,858 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,80,603కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 87 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,447కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,89,230 మంది కోలుకున్నారు. 1,35,926మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 75,05,010 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,47,89,784 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,65,944 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa