ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22 నెలల్లో రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు మరణించలేదు : మంత్రి పీయూష్ గోయల్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 12, 2021, 11:24 AM

 దేశంలో గడచిన 22 నెలల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రాజ్యసభలో శుక్రవారం మంత్రి గోయల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రైల్వే వంతనల గురించి మాట్లాడుతూ గత ఆరేళ్లలో భద్రతకు అధిక నిధులు కేటాయించామని మంత్రి చెప్పారు. 2019 మార్చి22వతేదీన జరిగిన రైలు ప్రమాదంలో చివరి ప్రయాణికుడు మరణించారని, అప్పటి నుంచి గత 22 నెలల్లో ఒక్క ప్రయాణికుడు కూడా రైలు ప్రమాదాల్లో మరణించలేదని మంత్రి గోయల్ వివరించారు. రైలు బ్రిడ్జీల మరమ్మతులు, నిర్వహణపై తాము దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందు, తర్వాత వంతెనలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జీల ఇన్ స్పెక్షన్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా రైల్వే బోర్డులో మొట్టమొదటిసారి సేఫ్టీ డైరెక్టరు జనరల్ ను నియమించామని మంత్రి గోయల్ రాజ్యసభలో చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa