ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆదివారం నాడు సమావేశమయ్యారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 07:01 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆదివారం నాడు సమావేశమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళుతున్న సందర్భంగా, గన్నవరం విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం వంటి విషయాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు కొద్దిసేపు సాగిన ఈ భేటీలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు.. కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. ఇటీవల కంభంపాటి మాతృమూర్తి వెంకటనరసమ్మ మరణించిన నేపథ్యంలో, రామ్మోహన్ రావును, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa