ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన ఎం.వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన సారథ్యం వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖను నరేంద్ర సింగ్ తోమర్కు, సమాచార, ప్రసార శాఖ బాధ్యతలను స్మృతి ఇరానీకి అప్పగించారు. నిన్న జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసింది. దీంతో ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతుకుముందు ఆయన భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa