ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్ఐసీ కస్టమర్లకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 16, 2021, 08:11 AM

దేశంలోని బీమా సంస్థలల్లో ఎల్ఐసీది ప్రత్యేక పాత్ర. కోట్లలో ఎల్ఐసీ పాలసీదారులు ఉన్నారు. ఎల్ఐసీ సంస్థ ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ప్రతి ఆదివారం ఎల్ఐసీ ఆఫీసులకు సెలవు ఉండేది. ఇక నుంచి ప్రతి శనివారం సెలవు ఉండనుందని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇక నుంచి ప్రతి శనివారం ఎల్ఐసీ ఆఫీసులకు సెలవు ఉండనుంది. తక్షణం ఇది అమల్లోకి రానుంది. అంటే వారంలో 5 రోజులు మాత్రమే ఎల్ఐసీ ఆఫీసులు పని చేయనున్నాయి. ‘నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ 1881’లోని సెక్షన్‌ 25 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని ఎల్ఐసీ పాలసీదారులు గమనించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa