ఇండియాలో విజృంభణ దారుణంగా ఉంది. రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లిస్ట్ లో ఉన్నది. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. సెకండ్ వేవ్ లో కేసులు విజృంభిస్తుండటంతో కేంద్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. ఇక ఇదిలా ఉంటె తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. 'కోవిడ్-19' విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనుంది కేంద్రం. ఇవాళ 11.30 గంటలకు రాష్ట్రాలతో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాలలో 'కరోనా' విజృంభణ, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ఇబ్బందులు, వైరస్ కట్టడిలో రాష్ట్రాలు ఎదురుకొంటున్న సమస్యలపై చర్చించనున్నారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి. అలాగే, 'కరోనా' కట్టడికి కేంద్రం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు గురించి రాష్ట్రాలకు వివరించనున్నారు కేంద్ర మంత్రి హర్షవర్దన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa