గత సీజన్ పరాభవం నుంచి చెన్నై కోలుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. తాజాగా సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిన మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇందులో ఏ ఒక్క ఆటగాడు కూడా 50 పరుగులు చేయకుండానే భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి ఇచ్చింది. డుప్లిసిస్ (33), మెయిన్ అలీ(26), రైనా(18), రాయుడు (27) పరుగులతో చెలరేగారు. రాజస్థాన్ బౌలర్లలో సకారియా (3/36), మోరిస్ (2/33) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ శాంసన్ (1) వెనుతిరగడంతో జట్టు విజయంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. బట్లర్ (49) తప్పా మిగిలి వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. వోహ్రా(14), దూబె(17) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. మొయిన్ అలీ (3/7), సామ్ కరన్ (2/24), జడేజా (2/28)ల ధాటికి రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. అలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa