దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజులు గడిచినా కొద్దీ వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతూ పోతున్నది. వరుసగా రెండో రోజు 3లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే రెండువేలకుపైగా జనం మహమ్మారి బారినపడి మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,14,835 కరోనా పాజిటివ్ కేసులు, 2,104 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 1,78,841 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965కు పెరిగింది.
ఇప్పటి వరకు 1,34,54,880 మంది కోలుకోగా.. 1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,91,428 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 13,23,30,644 డోసులు వేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 16,51,711 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 27,27,05,103 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa