దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ ఆశయ సాధనకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు జన నీరాజనాలతో బ్రహ్మ రథం పడుతున్నారని, 70 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమాలను పరుగులు తీయిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని పెనమలూరు నియోజక వర్గ శాసనసభ్యుడు కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాల ద్వారా అందిస్తున్న వినూత్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో రోజు రోజుకూ విశ్వాసం రెట్టింపవుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలే ప్రజా ధరణకు నిదర్శనంగా చెప్పవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన సమస్యలైన త్రాగు, సాగునీరు, డ్రైనేజీలు, అంతర్గత సిమెంట్ రోడ్లు, పింఛన్లు పక్కా గృహాల నిర్మాణాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారని తెలిపారు.
ఇటీవల జరిగిన పంచాయితీ, మునిసిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ బలపరచిన సర్పంచ్, వార్డు సభ్యులు, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు వందశాతం విజయం సాధించడంతో ప్రతిపక్ష టిడిపి అడ్రస్సు గల్లంతయ్యిందన్నారు. ముఖ్యంగా టిడిపి కంచుకోటగా చెప్పుకునే రాపూరు, వెంకటగిరి మండలాల్లో వైసీపీ కైవశం చేసుకోవడం జగన్ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాలకు నిదర్శనమన్నారు. అభివృద్ధి-సంక్షేమాలను రెండు కళ్లుగా భావించి కుల, మత, ప్రాంత, పార్టీల కతీతంగా జనరంజక పాలనతో దూసుకుపోతున్న జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు బౌతిక దూరం, మాస్క్ గ్లోజ్, శానిటైజర్ వంటి రక్షణ కవచాల ద్వారా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa