18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా ఇవ్వడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం అప్పట్లో జరిగే పని కాదని తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వ్యాక్సిన్ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యంపై ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వడం సాధ్యం కాదని గణాంకాలతో సహా వివరించారు. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్ల మంది ఉన్నారు. వీరికి 4 వారాల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వాలి. అంటే 52 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం.
ఇప్పటి వరకు దేశంలో 12 కోట్ల మందికే మొదటి డోస్ ఇచ్చారు. 2.60 కోట్ల మంది రెండో డోస్ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పటి వరకు వేసిన డోసులు 15 కోట్లు మాత్రమే.45 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే ఇంకా 39 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలి. భారత్ బయోటెక్ సంస్థ నెలకు 1 కోటి డోసులు తయారు చేస్తుంటే సీరం ఇన్స్టిట్యూట్ 6 కోట్లు తయారు చేస్తోంది. మరి కొన్ని విదేశీ వ్యాక్సిన్లు రావడానికి టైం పడుతుంది. ఈ లెక్కన అందరికి సరిపడా వ్యాక్సిన్లు కావాలి అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని అన్నారు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa