ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తౌటే తుఫాన్ తో గోవా తీరంలో అల్లకల్లోలంగా మారిన సముద్రం

national |  Suryaa Desk  | Published : Sun, May 16, 2021, 05:32 PM

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీరానికి చేరువ అవుతుండటంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా, కర్ణాటక తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ గాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. తుఫాను తీరానికి మరింత చేరువైతే పరిస్థితి ఇంకా బీభత్సంగా మారే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. గోవా తీరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయినది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa