ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి రావాలనుకునే వారికి ఈ-పాస్ తప్పనిసరి : పోలీస్‌ శాఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 25, 2021, 01:30 PM

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖ ఈ-పాస్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఈ-పాస్ లేకుంటే రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద సమస్య వస్తోందని, కనుక ఈ-పాస్ నిబంధనల ప్రకారం ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలిని సూచించింది. ఏపీలో ఉ.6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు ఉంటుందని, మిగతా సమయాల్లో ఏపీకి రావాలనుకునే వారికి ఈ-పాస్ తప్పనిసరిని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదని తెలిపింది. దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే ఈ-పాస్ మంజూరు చేయనున్నట్లు తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa