ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలమనేరులో ఓ క్రైమ్ కథ.. విచారణలో సంచలన నిజాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 29, 2021, 12:49 PM

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్ (23) బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పక్కింట్లో ఉండే శైలజ (16) ను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో శేఖర్ గతవారం గ్రామానికి వచ్చేశాడు. అయితే, తన కూతురిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న బాబు ఈ నెల 22న తను ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు బాలిక తన తండ్రి ఫోన్‌ ద్వారా అతడికి మెసేజ్ చేసింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక తండ్రి బాబు ఇంటికి వచ్చాడు. తన కూతురితో గదిలో ఉన్న ధనశేఖర్‌ను చూసి బాబు ఆవేశంతో రగిలిపోయాడు. ధనశేఖర్‌ను బాబు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో అత్యంత పాశవికంగా నరికి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తన వ్యవసాయ బావిలో పడేశాడు.




మూడు రోజుల తరువాత మృతదేహం ఉబ్బిపోయి పైకి తేలింది. దీంతో హత్య గురించి అందరికీ తెలిసిపోతుందని భావించిన బాబు.. మృతదేహాన్ని బయటకి తీసి ముక్కలుగా చేసి తన పొలంలో పూడ్చి పెట్టాడు. కొడుకు కనిపించకపోవడంతో ధనశేఖర్ తండ్రి ఈనెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాబుపై ఆనుమానం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్ కాల్‌డేటాను విశ్లేషించి బాలిక తండ్రే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎంత కిరాతకంగా హత్య చేసిందీ పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధనశేఖర్‌ను హత్య చేసిన బాబుతో పాటు ఆయనకు సహకరించిన అందర్నీ అరెస్టు చేస్తామని డీఎస్పీ గంగయ్య స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి బాబుతో పాటు ఆయన భార్య, కుమార్తెను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa