ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్‌ ధరల పెరుగుదల పై విజయవాడలో సిపిఎం వినూత్న నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 31, 2021, 03:28 PM

పెట్రోల్‌ ధరల పెంపును ఖండిస్తూ... సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డులో ఉన్న ఎస్‌పిఆర్‌ శ్రామిక భవన్‌లో సోమవారం నిరసన చేపట్టారు. క్రికెట్‌ బ్యాట్లు, తాళ్ళతో సైకిల్స్‌ను, బైక్‌ను లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుంటే కేంద్రం పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం సిగ్గు చేటని అన్నారు. పెట్రోల్‌ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా మరింత పెరుగుతాయన్నారు. జగన్‌, చంద్రబాబులు మోడి అంటే భయపడుతున్నారని, మే నెలలో ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలు 19 సార్లు పెరిగినా నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌ ధరలు తగ్గించే వరకు తాము పోరాటం చేస్తామని బాబురావు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa