ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. ఆ ప్రదేశంలోనే ఏనుగులు గుంపు హల్చల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 12, 2021, 11:22 AM

ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామీణ మండలం కోతిగుట్ట శివారులో శనివారం విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందినది. కోతిగుట్ట గ్రామ శివారులో.. ఏనుగుల గుంపు నుంచి ఓ గజరాజు విడిపోగా.. పొలంలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆ ఏనుగు ఒంటిని రాసుకునేందుకు ప్రయత్నించింది. ఏనుగు బలానికి విద్యుత్ స్తంభం విరిగిపోగా కరెంటు తీగలన్నీ మీద పడ్డాయి.


దీంతో ఆ ఏనుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఏనుగు ఢీకొనడంతో కరెంట్‌ తీగలు తెగిపడినప్పుడు విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో గుంపులోని మిగిలిన ఏనుగులకు ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి ఈ ఘటన జరగగా.. చనిపోయిన గున్న ఏనుగు కోసం మిగతా ఏనుగుల గుంపు శుక్రవారం వేకువజాముదాకా అక్కడే ఘీంకారాలు చేస్తూ ఉండిపోయాయని స్థానిక రైతులు తెలిపారు. ఏనుగు మరణించిన చోటే తిష్ట వేసిన 20 ఏనుగులు గుంపు ఆ ప్రదేశంలోనే హల్చల్ చేసినట్లు చెప్పగా.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏనుగులు గ్రామాల్లోకి చొరబడతాయేమోనని గ్రామస్తులు భయంతో వాటిని అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. కానీ గజరాజులు తిరగబడి గ్రామస్తులను తరమడంతో వెనక్కు తగ్గారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa