ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణశాఖ హెచ్చరిక..4 రోజులు జాగ్రత్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 09, 2021, 08:24 AM

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాబోవు 4 రోజుల పాటు దక్షిణకోస్తా-తమిళనాడు తీరాల వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa