ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచారణకు హాజరైన కార్తీ చిదంబరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2017, 06:11 PM

 కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఇవాళ సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు అక్రమంగా అనుమతులు ఇప్పించారన్న కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. సీబీఐ కోర్టులో ఆగస్టు 23న హాజరు కావాలని సుప్రీం కోర్టు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఆయన ఈ రోజు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు అనుమతులు, ఫారెన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు వ్యవహారాల్లో ఆయన ప్రమేయం ఉందన్న అనుమానంతో గతంలో ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌సెల్‌- మాక్సిస్‌ ఒప్పందానికి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం అనుమతులిచ్చారన్న కేసులో కార్తీ చిదంబరంపై ఆరోపణలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa