నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసంలో భూమా కుటుంబీకులు, టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంతో నంద్యాలలో సంబరాలు అంబరాన్నంటాయి. నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్ కేంద్రం మొదలుకుని అమరావతి వరకూ టీడీపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బాణసంచాలు కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నాయి. నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నిక విజయం ప్రజలేదనని, నంద్యాల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నంద్యాలలో జగన్ తిష్టవేసి మరీ ప్రచారం చేశారని, అయినప్పటికీ ఆయన ఓడిపోయారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa