ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా జవాన్ మృతి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 08:39 PM

తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఘటనలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కురబలకోట ఎగువ రేగడ గ్రామానికి చెందిన జవాన్ సాయి తేజ మృతి చెందాడు, ఈ జవాన్ మృతి తో కులబలకోటలో విషాద ఛాయలు అలముకున్నాయి.సాయితేజ మరణించారన్న వార్త తెలుసుకొని బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. తన భర్త ఇక లేడన్న వార్తను తలచుకొని సాయితేజ భార్య శ్యామల శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 13మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు,

వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ఆర్మీకి చెందిన MI-17 V5 హెలికాఫ్టర్ లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్ ను కొనఊపిరితో ఉండగా స్థానికులు, ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఐతే ప్రమాదంలో రావత్ శరీరం 80శాతం కాలిపోయింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బిపిన్ రావత్ మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa