ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తతో గొడవలు.. క్షణికావేశంలో దారుణం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 09, 2021, 02:53 PM

తమిళనాడులోని కరూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరూర్ జిల్లా కడవూర్ తాలూకాలోని పుసరిపట్టి గ్రామానికి చెందిన శక్తివేల్, శరణ్య దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కనిష్క(6), పువిష(3) ఉన్నారు. భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. పిల్లలు తల్లిదండ్రులు గొడవ పడుతుండటం చూసి ఏడుస్తుండేవారు. దీంతో శరణ్య తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది.


ఈ క్రమంలోనే క్షణికావేశంలో శరణ్య తొందరపాటు నిర్ణయం తీసుకుంది. భర్త గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని 50 అడుగుల లోతైన బావి వద్దకు వెళ్లింది. పిల్లలిద్దరినీ ఆ బావిలో పడేసి, తానూ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్తకు మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో భార్యాపిల్లలు కనిపించలేదు. అతడు కంగారు పడి అంతటా వెతికాడు. చివరకు బావిలో ముగ్గురి శవాలను చూసి శక్తివేల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దిండిగుల్ జిల్లా అధికారులు కుజిల్‌యంపర ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఘటన గురించి సమాచారం అందించారు. ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం కరూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పలవీడు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం గురించి భర్త వేధించాడేమోనన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa