ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని వారణాసి వెళ్లి గంగా నదిలో మునిగి, ఆలయంలో కూర్చున్నారని ఆమె తెలిపారు. కోవిడ్-19 బారిన పడి మరణించిన వారి మృతదేహాలను గంగానదిలో పారేసిన నేపథ్యంలో ప్రధాని నదిలో ఎలా మునిగారని మమతా ప్రశ్నించారు.
బీజేపీ నేతలకు ఎన్నికల సమయంలో గంగా నది గుర్తుకొస్తుందని, ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతారని ఎద్దేవా చేశారు. తాను బ్రాహ్మణ కుటుంబానికి చెందానని , హిందూ ఆచార వ్యవహారాలపై తనకు కాషాయ పార్టీ సర్టిఫికెట్ అవసరం లేదని దీదీ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో 40 ఏళ్లుగా కాళీపూజ జరుగుతోందని, జగద్ధాత్రితోపాటు ఇతర పూజల్లో తాను పాల్గొంటానని చెప్పింది. దుర్గాపూజ సమయంలో ఒక్కో మండపానికి రూ.50 వేలు ఇస్తామని బీజేపీ కానీ అవేమి లేవని ప్రశ్నించారు. మైనార్టీలతో కలిసి ఈద్ వేడుకల్లో పాల్గొంటానని, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటానని, గురుద్వారాను కూడా సందర్శిస్తానని దీదీ చెప్పారు. తనకు అన్ని మతాలు ఒకటేనని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa