ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు గవర్నర్ దంపతులను కలవనున్న సీఎం జగన్ దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 08:42 PM

బుధవారం రాజ్‌భవన్‌లోని ఆయన నివాసంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. గవర్నర్ దంపతులు ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. తన భార్యతో కలిసి సీఎం జగన్‌ గవర్నర్‌ దంపతులను పరామర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్‌లు కరోనా తర్వాత ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
కోవిడ్‌కు గతంలో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకుని విజయవాడ వచ్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్లి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చారు. వైఎస్ జగన్, భారతి కలిసి ఆయన ఆరోగ్యం గురించి రేపు తెలుసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa