ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 10:30 PM

మహారాష్ట్ర లో నాలుగు కొత్త ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. ఉస్మానాబాద్ జిల్లాలో రెండు కేసులు, ముంబై, బుల్దానాలో ఒక్కొక్క కేసు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్‌ కరోనా కేసుల సంఖ్య 32కు చేరినట్లు తెలిపింది.  మహారాష్ట్ర లో గత 24 గంటల్లో కొత్తగా 925 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి పది మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 6,467 అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa