ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒమిక్రాన్ భయం.. పిల్లల్ని స్కూళ్లకు పంపడానికి భయపడుతున్న తల్లిదండ్రులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 16, 2021, 12:09 PM

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకైతే తల్లిదండ్రులు పెద్దగా సంశయించాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి అని సూచిస్తున్నారు.


కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో పిల్లల్లో వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపించలేదు. పిల్లలు పెద్దగా ఆస్పత్రి పాలైన దాఖలాలు కూడా లేకపోవడం ఊరట కలిగిస్తోంది. దేశంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని సర్వేల్లో చిన్నారుల్లో కూడా కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. కొందరు చిన్నారులు ఇదివరకే ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన వారే కాబట్టి కొత్తగా వైరస్‌ సోకే అవకాశాలు తక్కువేనని ఎపిడమాలజిస్టులు అంటున్నారు. ఒమిక్రాన్‌ కేసుల నేపథ్యంలో స్కూళ్లు మళ్లీ మూత పడతాయా? అనే అనుమానాలు చాలా మంది తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం అలాంటి భయాలు అక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు. పాజిటివిటీ రేటు పెరిగితే స్కూళ్లు మూసివేయాలని మాత్రం సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa