ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర: జగన్‌

Andhra Pradesh Telugu |   | Published : Sat, Sep 02, 2017, 05:30 PM

పులివెందుల: నంద్యాల ఉప ఎన్నికలో తెదేపాపై అభిమానంతో ప్రజలు ఓట్లు వేయలేదని, ఓటు వేయకపోతే పింఛన్లలో కోత విధిస్తామంటూ బెదిరించి వేయించుకున్నారని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. అక్టోబర్‌ 2 వరకు వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 27 నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర కొనసాగుతుందని జగన్‌ స్పష్టంచేశారు. ఈ పాదయాత్రలో ప్రతి వైఎస్‌ఆర్‌ కార్యకర్త ఏకం కావాలని, తనకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa