శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా శ్రీవారి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. భారత్ చేరుకున్న శ్రీలంక ప్రధానికి రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ హార్దిక స్వాగతం పలికారు. ఈ రాతక్రి తిరుమలలో బస చేయనున్ను రాజపక్స కుటుంబం ఉదయం శ్రీవారిని దర్శించుకోనుంది. శ్రీలంక ప్రధాని రాక నేపథ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. రాజపక్స తిరుమల వెంకన్న భక్తుడు. ఆయన గతంలోనూ ఇక్కడికి పలు పర్యాయాలు విచ్చేసి స్వామివారినిసేవించుకున్నారు. చివరిగా గతేడాది ఫిబ్రవరిలో తిరుమలను సందర్శించారు. శ్రీలంక ప్రధానమంత్రికి భారతీయ సంసృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం : తిరుమల శ్రీవారి దర్శనార్థం కొలంబో విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మద్యాహ్నం 11.37 గం. రేణిగుంట విమానాశయం చేరుకున్న డెమోక్రటిక్ సోషియలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజ పక్సే కి భారతీయ సంసవతి సాంప్రదాయాల, సంగీత నృత్యాలతో ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎస్.పి. వెంకటప్పల నాయుడు, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్ , చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా
అధికారులు స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం శ్రీలంక ప్రధాని రోడ్డు మార్గాన తిరుమల వెళ్ళారు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa