ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 24, 2021, 02:32 PM

కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కాల్‌ డేటా, ఇంటర్నెట్‌ యూసేజ్‌కు సంబంధించిన సమాచారాన్ని రెండేళ్ల వరకు భద్రపరచాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ప్రస్తుతం యూజర్ డేటాను సంస్థలు ఏడాది పాటు స్టోరేజ్ చేస్తుండగా భద్రతా కారణాల రీత్యా ఈ వివరాలను రెండేళ్ల వరకు భద్రపరచాలని ఆదేశించింది. రెండేళ్ల తర్వాత ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే డేటాను తొలగించవచ్చని పేర్కొంది. సబ్‌స్క్రైబర్ల లాగిన్‌, లాగౌట్‌, ఈమెయిల్‌, మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా కాలింగ్‌, ఇతర యాప్‌లలోకి లాగిన్‌ డిటెయిల్స్ ను రెండేళ్ల పాటు నిల్వ చేయాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa